దారుణం: ఏడేళ్ల బాలుడిని రాళ్లతో కొట్టి చంపారు

TG: హైదరాబాద్ అత్తాపూర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడి తలపై దుండగులు రాళ్లతో కొట్టి హతమార్చారు. దుండగులు మీరాలం ట్యాంక్‌ వద్ద హత్య చేసి మృతదేహాన్ని పారేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. మృతుడు నెక్లెస్‌రోడ్డుకు చెందిన మహమ్మద్‌ రహీమ్‌గా గుర్తించారు. కాగా, ఈ దారుణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி