నేడు మహిషాసురమర్దిని దేవీగా దర్శనమివ్వనున్న అమ్మవారు

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం మహిషాసురమర్దిని దేవీగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన మహిషాసురుణ్ని చంపిన మహోగ్రరూపం ఇది. సకల దేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడ సాధ్యం కాని దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినియై ఈ తల్లి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంది. మహిషాసుర సంహారం జరిగిన రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

தொடர்புடைய செய்தி