తెలంగాణలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు.