రోడ్డు ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలు

గుడిహత్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామానికి చెందిన ముండే సతీష్ ద్విచక్ర వాహనంపై కొల్హరి గ్రామం నుండి గుడిహత్నూర్ వస్తుండగా కారుని వెనుక నుండి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సతీష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స కోసం ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி