విద్యుత్ షాక్‌తో మేకలు మృతి

విద్యుత్‌ షాక్‌తో 5 మేకలు మృతి చెందిన సంఘటన గుడిహత్నూర్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడు కథనం ప్రకారం.. మండలంలోని గురుజా గ్రామానికి చెందిన గోవింద్ అనే వ్యక్తి మేకలు గ్రామ శివారులో ఉన్న పొలంలో మేత మేస్తుండగా పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురై మృతి చెందాయి. మృతి చెందిన మేకల విలువ రూ. 55 వేలు ఉంటుందని బాధితుడు గోవింద్ తెలిపాడు. బాధిత వ్యక్తిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

தொடர்புடைய செய்தி