గణేష్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

గుడిహత్నూర్ గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఇచ్చోడా సిఐ భీమేష్ తెలిపారు. శనివారం గుడిహత్నూర్ పోలీస్‌ స్టేషన్‌లో సాయంత్రం శాంతి సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ గర్వపడేలా అన్ని పండుగలను కలిసి జరుపుకోవాలన్నారు. తమ ఆచారాలను పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలని తెలిపారు. అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని వివరించారు.

தொடர்புடைய செய்தி