పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కొత్త పీఆర్సీ (Pay Revision Commission) వేయాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చలం శ్రీనివాసరావు, సత్యనారాయణ, రామారావుతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీఆర్టీయూ కార్యకర్తలు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ ధర్నా చేపట్టారు.