కనిగిరి మునిసిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు సాయి నగర్లో మూడు నెలలుగా డ్రైనేజీలోని చెత్త తీయలేదని వార్డ్ వాసులు ఆరోపిస్తున్నారు. చెత్త తీయకపోవడంతో దుర్వాసన వస్తున్నట్లు ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా డ్రైనేజ్ మురికి కంపుతో దోమలు విపరీతంగా వస్తున్నాయని, వెంటనే డ్రైనేజ్ కాలువను శుభ్రం చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.