జిల్లాలో పొగాకు కొనుగోళ్లు చివరి అంకానికి చేరాయి

జిల్లాలో పొగాకు కొనుగోళ్లు చివరి అంకానికి చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 29న తొలి విడతగా ఎస్ఎల్ఎస్ రీజియన్, మార్చి 6న ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటికే ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కనిగిరి, నెల్లూరు జిల్లా కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో విక్రయాలు పూర్తయ్యాయి. ఒంగోలు రెండో వేలం కేంద్రంలో సోమవారంతో ముగియనున్నాయి. పొదిలి, కందుకూరు-2 కేంద్రాల్లో ఈ నెలాఖరులోపు, ఒంగోలు-1, వెల్లంపల్లి, టంగుటూరు, కొండపి, కందుకూరు-1 కేంద్రాల్లో అక్టోబర్ 5వ తేదీలోపు కొనుగోళ్లు పూర్తి కానున్నాయి.

தொடர்புடைய செய்தி