బూచేపల్లి ట్రస్ట్ సహకారంతో భోజనం పంపిణీ

దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున విజయవాడలోని వరద బాధితులకు 10, 000 వాటర్ బాటిల్స్, పదివేల పులిహోర ప్యాకెట్లను ప్రత్యేక వాహనాలలో గురువారం విజయవాడకు తరలించారు. బూచేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు విజయవాడలోని వరద బాధితులకు వీటిని అందజేశారు. దీంతో జిల్లా ప్రజలు ఎమ్మెల్యేకు, వెంకాయమ్మకు అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி