వరద ధాటికి అధ్వానంగా మారిన రహదారి

అమరావతి నుంచి బెల్లంకొండ డబుల్ రోడ్డు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. కల్వర్టుల సమీపంలో ఎక్కడికక్కడ గ్రావెల్ కంకరాళ్లు కొట్టుకుపోయి గుంతల మయంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని గురువారం వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన రోడ్లను బాగు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరారు.

தொடர்புடைய செய்தி