పంట నష్టం అంచనాలు చేపట్టిన అధికారులు

పెదకూరపాడు మండలంలో వరద ప్రభావానికి నష్టపోయిన పంట పొలాలను.. వ్యవసాయ అధికారులు స్థానిక వీఆర్వోల ఆధ్వర్యంలో నష్టం అంచనా కార్యక్రమం చేపట్టారని సోమవారం తాహశీల్దార్ డానియల్ అన్నారు. ముంపు గ్రామాల్లో పర్యటించి రైతులతో కలిసి పంట పొలాలకు చేరుకొని పంట అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని తాహశీల్దార్ అన్నారు. వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులతో సమన్వయంతో పనిచేసి పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி