ప్రత్యేక సమస్యల పరిష్కార వేదికకు 21 ఫిర్యాదులు

పల్నాడు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అరుణబాబు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు 21 అర్జీలను అందించినట్లు తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி