మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

అంకురాలతో సాంకేతికతను ఏకీకృతం చేసి వరద బాధితులకు సహాయం చేసినట్లు మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా.. ‘స్టార్టప్ ఆంధ్ర నినాదమే కాదు.. పరిపాలన విధానాన్ని మార్చే ప్రక్రియ. ఇటీవల వచ్చిన వరద విపత్తును ఎదుర్కోవడంలో అంకుర సంస్థలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇదో నూతన అధ్యయనం. ఆయా సంస్థల సహాయంతో బాధితుల గణన, పరిహారం బదిలీకి వీలు కలిగింది.’ అని లోకేశ్ పోస్టు పెట్టారు.

தொடர்புடைய செய்தி