పాఠాలు అర్థంకావడం లేదని విద్యార్థులు కలెక్టర్ కు ఫిర్యాదు

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తెనాలి మండలం పెదరావూరుకు చెందిన విద్యార్థులు ఫిర్యాదు అందించారు. తెలుగు టీచర్ చెప్పే పాఠాలు ఏమాత్రం అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదని అన్నారు.

தொடர்புடைய செய்தி