ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తాం: లోకేశ్

ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు విద్యాశాఖమంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉండవల్లిలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఎన్ సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி