తాడేపల్లి: భారీ వర్షాలపై హోంమంత్రి అనిత అధికారులతో సమావేశం

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అల్పపీడన ప్రభావం, వర్షపాతం తదితర వివరాలు అధికారులు మంత్రికి వివరించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி