తెనాలి కౌన్సిల్ సమావేశంలో 27 అంశాలు ఆమోదం

తెనాలి మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశంలో ఎజెండాలోని 27 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. ఎజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించకుండా, ఆమోదించడంపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక పోడియం వద్ద టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేశారు. చిన్నచిన్న వివాదాల మినహా కౌన్సిల్ సమావేశం ముగిసింది.

தொடர்புடைய செய்தி