తెనాలి: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 56 అర్జీలు

తెనాలిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ 56 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి అర్జీని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி