పెదకూరపాడు: గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే

పెదకూరపాడులో సోమవారం జరిగిన 'పల్లె పండుగ' కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామసభలో ఆమోదించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி