కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

పర్చూరు మండలంలోని స్థానిక పాఠశాల నందు ఆదివారం ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యపరంగా అందిస్తున్న సేవలపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி