సీసీ కెమెరాల ఏర్పాటు అవశ్యం: ఇంకొల్లు ఎస్సై సురేష్

ఇంకొల్లు మండలం పూసపాడు అడ్డరోడ్డు వద్ద ఇంకొల్లు ఎస్సై సురేష్ గ్రామస్తులకు, వ్యాపారస్తులకు ఆదివారం సీసీ కెమెరాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ దొంగతనాలు నిర్మూలించుటకు, వాస్తవాలు తెలుసుకోవడానికి సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల నేరస్తులను త్వరగా పట్టుకోవడంలో ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. అందువల్ల అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி