ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆదివారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో విజయవాడకు చెందిన రమేష్ ఆసుపత్రి వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. సుమారు 600 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్లు తెలియచేశారు.

தொடர்புடைய செய்தி