ఓ చరిత్ర సృష్టించాము: మంత్రి

రాష్ట్రంలో 13,326 గ్రామాలలో ఒకేసారి గ్రామసభలు నిర్వహించటం ఒక చరిత్ర అని రాష్ట్ర మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సిఎస్ పురంలో శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ పల్లెలను స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయన్నారు. పల్లెల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி