చెట్లు పెంచడం సామాజిక బాధ్యతగా భావించాలి: జేసి

ఒంగోలు నగరం కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ చెట్లు పెంచడం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. సహజ వనరులు అడవులను కాపాడుతున్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி