వైసీపీ అధినేత జగన్ తీరు సిగ్గుపడేలా ఉంది: చదలవాడ

గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జగన్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న అక్రమాలను ప్రజలు అందరు చూస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో అన్నదానం దగ్గర నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్ని కల్తీ చేశారని అన్నారు.

தொடர்புடைய செய்தி