సనాతన ధర్మాన్ని జగన్ అపవిత్రం చేశారు: గాదె

మంగళగిరి నియోజకవర్గంలో ఆదివారం జనసేన పార్టీ నేతలు ప్రత్యేక పూజాకార్యక్రమాలతో పాటూ హోమాలు నిర్వహించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు మద్దతుగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు జరిగాయి. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ సనాతన ధర్మాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி