అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి: కుమారి

అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గుంటూరులోని పీడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుమారి మాట్లాడుతూ గత ఏడాది నుంచి పెండింగ్ లో ఉన్న హెల్పర్లకు ప్రమోషన్లు అందించాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు నేతాజీ, రాధా, వెంకాయమ్మ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி