పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన మహిళలు

కొరిశపాడు మండలంలో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు మెదరమెట్లలో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను తమకు చూపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాత్రి వేళల్లో మత్తు ఇంజక్షన్ ఇచ్చి తమ పశువులను అపహరించారని పలువురు మహిళలు వాపోయారు.

தொடர்புடைய செய்தி