ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి

కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు అన్నారు. ఆదివారం మండలం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాల్సింది కూటమి పార్టీల నాయకులు కాదని విమర్శించారు. మంచి ప్రభుత్వం పేరుతో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி