మేదరమెట్ల: మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా బుధవారం మేదరమెట్ల స్టేషన్ పరిధిలో మద్యం విక్రయాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని మేదరమెట్ల ఎస్. ఐ మహమ్మద్. రఫీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతిలో గాంధీ జయంతిని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధమన్నారు. మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி