బాకీ డబ్బులు చెల్లించలేదని దివ్యాంగురాలు నిరసన

కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు తన్నీరు అంజమ్మ తనకు అదే గ్రామానికి చెందిన వల్లెపు సుబ్బారావు లక్షన్నర రూపాయలు బాకీ డబ్బులు చెల్లించలేదని ఆదివారం రోడ్డుపై నిరసనకు దిగింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 9 సంవత్సరాల నుంచి తనకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు బాకీ చెల్లించే వరకు రోడ్డు మీద కూర్చుంటానని అంజమ్మ బైఠాయించింది.

தொடர்புடைய செய்தி