విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన

అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెల్ప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాగర్ పాల్గొని హెచ్ఐవిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు హెచ్ఐవి, మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

தொடர்புடைய செய்தி