వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శవ పరీక్షల కేంద్ర నిర్వహణ పటిష్టంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శవపరీక్షల కేంద్ర నిర్వహణపై జరిగిన సమావేశంలో సమీక్షించారు. శవాల పోస్టుమార్టం సకాలంలో జరిగి గౌరవంగా పంపేల పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మెడికల్, ఫోరెన్సిక్, మున్సిపల్, పోలీస్ అధికారులు సమన్వయంతో పోస్టుమార్టం నిర్వహించాలన్నారు.