భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో ప్రమాదవశాత్తు బండి అశోక్ గౌడ్ కు చెందిన పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం దమ్మన్నపేట గ్రామంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నగదు, పండించిన పంట, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఇది చూసిన ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.