చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం సురమాంబ-కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. బోనాల సందర్బంగా గౌడ సంఘం నాయకుల పిలుపు మేరకు కళ్యాణ మహోత్సవానికి పవన్ సాయి హాస్పిటల్ ఎండి డా. అలేటి శ్రీనివాస్ గౌడ్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా గౌడ సంఘం సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ని శాలువతో సన్మానించి, జ్ఞాపికను బహూకరించారు.