రైతులకు పేదలకు ఎటువంటి సాయం అందలేదు.. పార్టీ ఇంచార్జ్
బిఆర్ఎస్ ప్రభుత్వం లోనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రైతులకు పేదలకు ఎటువంటి సాయం అందలేదని బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తండా పరిధిలోని రేకుల తండాలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.