రైతులకు సబ్సిడీ ఎరువులు పంపిణీ
అన్నమయ్య జిల్లాలోని రైతులకు సబ్సిడీపై వేరుశనగ మరియు పచ్చిరొట్టె ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ గురువారము తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని రైతులందరికీ 40% సబ్సిడీపై వేరుశనగ, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని జనుము 2578 క్వింటాళ్లు, జీలుగ 2492 క్వింటాళ్లు, పిల్లిపెసర 76 క్వింటాళ్లు మంజూరయ్యాయన్నారు.