మేము సైతం మీ కోసం అంటూ వరద బాధితులకు విరాళాలు

67பார்த்தது
కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వరద బాధితుల సహాయం కోసం " మేము సైతం"మీ కోసం అనే బ్యానర్ తో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కాగా మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ విరాళాల సేకరణ ర్యాలీ ప్రారంభించారు. విద్యార్థుల సామాజిక దృక్పథాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యయులు డి. మార్కండే, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி