విద్యాపీఠంలో సోమవతి అమవాస్య వేడుకలు
సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో సోమావతి అమావాస్య వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షురాలు ఆమేటి మాలతి, కార్యదర్శి ఈల్లింతల పద్మజ, కోశాధికారి ఆమేటి రాణి పాల్గొన్నారు.