రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: ఎస్సై రాంమూర్తి

51பார்த்தது
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: ఎస్సై రాంమూర్తి
కొండమల్లేపల్లి: మండలపరిధిలోని హైదారాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎస్సై రాంమూర్తి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదాల స్పాట్లుగా గుర్తించిన పెండ్లిపాకల ఎక్స్ రోడ్డు, చిన్న అడిశర్లపల్లి శివారు, పోలీస్ స్టేషన్ ముందర గురువారం వేగ నియంత్రణ సూచికలను ఏర్పాటు చేశారు. కాగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎస్సై చేస్తున్న కృషిని వాహనదారులు, స్థానికులు అభినందిస్తున్నారు.

தொடர்புடைய செய்தி