జాతీయ అంతరిక్ష దినోత్సవం

58பார்த்தது
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని గురువారం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు చంద్రయాన్ నమూనాల తయారు చేసి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన నమూనా పరికరాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

தொடர்புடைய செய்தி