తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

83பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.