మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో

51பார்த்தது
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో సుతార్ పల్లి గ్రామస్తులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. భూ వివాదంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న పున్న స్వామి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. బెదిరింపులకు పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలని, గ్రామస్తులు డిమాండ్ చేస్తూ, మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో, గ్రామస్థులు వారితో వాగ్వాదానికి దిగారు.

தொடர்புடைய செய்தி