గద్వాలలో నీట మునిగిన రైల్వే వంతెన

80பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలవడంతో రాకపోకలు స్తంభించాయి. మంగళవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓ మోస్తారు వర్షం కురిసింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వర్షపు నీరు అక్కడికి చేరుకోవడంతో రైల్వే వంతెన వర్షపు నీటితో నిండుకు పోయింది. పెద్దదిన్నె నుంచి గద్వాలకు వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం.

தொடர்புடைய செய்தி