మంథనిలో తొలి ఏకాదశి పండుగ సందడి

63பார்த்தது
పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలోని శ్రీ గౌతమేశ్వర స్వామి దేవస్థానానికి బుధవారం భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి, ఆలయంలో గల పరమ శివుడిని దర్శించుకున్నారు. గౌతమీ తీరంలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி