నీట్ పరీక్ష లీకేజీల కుంభకోణం పై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకొని నీట్ పరీక్షని రీ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ. నీట్ పరీక్షలు నిర్వహించడానికి బిజెపి సర్కార్ NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కు బాధ్యతలు అప్పగించిందన్నారు.