బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపెట్ గ్రామంలోని శ్రీరామ గణేష్ మండలి నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలంపాట నిర్వహించగా గ్రామానికి చెందిన శివకుమార్ శివగంగ దంపతులు లడ్డు వేలం పాటలో పాల్గొని 9వేలకు, దెగ్లూర్ శంకరప్ప దంపతులు ఆపిల్, చిన్న లడ్డు 3800కు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.