బేగంపేట్ ఫ్లై ఓవర్‌పై డీసీఎం బీభత్సం

71பார்த்தது
బేగంపేట్ ఫ్లై ఓవర్‌పై గురువారం ఓ డిసిఎమ్ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో బేగంపేట్ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిర్ధారించారు. డ్రైవర్ కు గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో డిసిఎమ్ ను రోడ్డుపై నుంచి పక్కకు తలగించారు.

தொடர்புடைய செய்தி