కేటీఆర్ పై బీజేపీ మంత్రి ఫైర్
బిజేపీ ఎంపీ రఘునందన్ రావు శనివారం మీడియాతో సమావేశమయ్యారు. 2014లోనే ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టలేదని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్కు చెరువులు కబ్జా చేశారని తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మంత్రిగా కేటీఆర్ ఎన్నో తప్పులు చేశారంటూ మండిపడ్డాడు.